Sunday, January 1, 2012

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం - చివరిమాట

పల్నాటి వీరచరిత్ర ద్విపదకావ్యం పూర్తి అయ్యింది. ఈ కావ్య రచయిత శ్రీనాథుని గురించి తెలియని సాహిత్యప్రియులు ఉండరనే తలుస్తాను. ఆయన వ్రాసిన కావ్యాలేకాక, చాటువులు మొదలైనవికూడా ప్రతివారికీ తెలిసినవే. పలనాటి వీరచరిత్ర ఆయన వ్రాసిన కావ్యాలలో చివరికావ్యంగా పేర్కొంటారు. 

ఈ కావ్యంలో శ్రీనాథుడు తాను రాయల ఆస్థానంలో ఉండి చూసిన అనేకమైన ఆచార వ్యవహారాలను యథాతధంగా పొందుపరచటమే కాకుండా అనేక చారిత్రికాంశలను మనముందు తీసుకువచ్చారు. రాజనీతి, యుద్ధనీతి వంటి విషయాలను బ్రహ్మనాయుని నోటిద్వారా, స్త్రీ ధర్మాలను మాంచాల తల్లిద్వారా మనకు తెలియచేసారు. 

పల్నాటివీరచరిత్రలో శ్రీనాథుడు కేవలం బాలచంద్రుని యుద్ధం వరకు మాత్రమే రచించాడు. మిగిలిన కథను ఇతర రచయితలు రచించారు. అవికూడా దొరికితే మీతో తప్పకుండా పంచుకుంటాను.

నా ఈ పోష్టులలో అనేకమైన తప్పులు ఉన్నాయి. అనేకమంది మిత్రులు తప్పులను సూచించారు. సవరిస్తూనే ఉన్నాను. ఐనా ఇంకా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఓపికగా చదివిన వారికి ధన్యవాదాములు. ఇంక త్వరలో మరొక కొత్త కావ్యంతో మీ ముందుకు వస్తాను.

మరొక మారు ధన్యవాదములు. 
  

No comments:

Post a Comment